మసాజ్ ముసుగులో వ్యభిచారం..



హైదరాబాద్‌, అక్షరవిజన్ న్యూస్ -: బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసీ నిర్వాహకులను అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఉన్న స్పా సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేశారు. కేంద్రాన్ని నడుపుతున్న వ్యక్తి తో పాటు నలుగురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్‌లోని ప్రముఖుల కుమారులేనని సమాచారం. సహ ఆర్గనైజర్ సయ్యద్ బిల్లాల్‌తో పాటు ఫహద్, హసీదుద్దీన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఐదుగురు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.అధికారులు వారిని రెస్క్యూ హోంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బ్యూరో చీఫ్ -: డి ఎస్ ఎన్.

Comments