బంగారు సంపెంగలతో స్వర్ణపుష్పార్చన





సింహాచలం, అక్షరవిజన్-: శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణపుష్పార్చన,  ప్రతి  గురువారం,ఆదివారం,ఉదయం స్వామివారికి స్వర్ణపుష్పార్చన భక్తులు ప్రతీ వారం పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణపుష్పార్చణ చేయించుకుంటున్నారు . శ్రీ సింహాచల పుణ్య క్షేత్రములో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని  సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి  స్వర్ణపుష్పార్చన,  సేవ వైభవంగా  నిర్వహించారు. ప్రత్యక్షంగా మరియు  పరోక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.


బ్యూరో చీఫ్:- డీ ఎస్ ఎన్. 
Comments