బంగారం పట్టివేత...

  అక్షరవిజన్ న్యూస్.. హైదరాబాద్.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారంతో వెళ్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.34 లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విమానాశ్రయంలో గతంలో చాలా సార్లు పరిమితికి మించి బంగారాన్ని తీసుకెళ్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి బంగారాన్ని తరలించేందుకు చేస్తున్న కొత్త కొత్త ప్రయత్నాలను కస్టమ్ అధికారులు కనిపెట్టేస్తున్నారు...

Comments